Sunday, May 5, 2024

వివాదాల్లో మ‌ళ్లీ పెళ్లీ.. స్ట్రీమింగ్ నిలిపివేసిన ఓటీటీ సంస్థ‌

సినీ నటుడు నరేష్, న‌టి పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రలలో నటించిన మళ్లీ పెళ్లి. ఈ మ‌ధ్య‌నే రిలీజ్ అయ్యింది. ఇప్పుడీ సినిమా అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక రెండు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు, అమెజాన్ ప్రైమ్ వీడియో & ఆహా వీడియో ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేశాయి.

ఈ రెండు ఓటీటీ సంస్థ‌లు కొన్ని రోజుల క్రితం సినిమాను ప్రసారం చేయడం ప్రారంభించారు. OTT విడుదలలో చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే, నరేష్ మాజీ భార్య ఈ చిత్రంపై OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారాన్ని నిలిపివేయాలని చట్టపరమైన కేసును దాఖలు చేసింది. ఈ కారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ఆపివేసిన‌ట్టుతెలిపింది. అయితే ఆహా మాత్రం ఇప్పటికీ సినిమాను ప్రసారం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement