Saturday, April 27, 2024

నిధి దశ మారినట్టేనా ? మహేష్ సినిమాలో డైరెక్ట్ గా !!

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది నిధి అగర్వాల్. అంతకన్నా ముందు సవ్యసాచి, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలు చేసినప్పటికీ…ఆ సినిమాలు ఆ స్థాయిలో హిట్ ను అందుకోలేక పోయాయి. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. కానీ పూజా ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. దీంతో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట దర్శకనిర్మాతలు.

అంతే కాదు దర్శక నిర్మాతల లిస్ట్ లో నిధి అగర్వాల్ పేరు కూడా వచ్చిందట. అయితే నిధి మెయిన్ రోల్ కాదట. సెకండ్ లీడ్ అని తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఒకవేళ అదే కనుక నిజమైతే నిధి అగర్వాల్ కు మంచి అవకాశం లభించినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement