Wednesday, May 1, 2024

కొత్తగా పెళ్లి అయిన జంట కథకు ఫ‌స్ట్ క్లాప్

చెతన్య రావ్‌, హృతికా శ్రీనివాస్‌ హీరో హీరోయిన్లుగా గౌతమ్స్‌ సాయి తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారం భమైంది. పలువురు సినీ సెలబ్రిటీ-లు చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.గౌతమ్‌ మాట్లాడుతూ ” మా గౌతమ్స్‌ ఈగల్‌ ఎంటర్‌-టైన్మెంట్‌ ప్రై.లి బ్యానర్‌లో మేం చేస్తున్న తొలి సినిమా ఇది. డైరెక్టర్‌ సాయితేజ ఓ డిఫరెంట్‌ పాయింట్‌తో కథ సిద్ధం చేశారు. కొత్తగా పె్లళన జంటలో భర్త కొన్ని అనుకోని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని తనెలా హ్యాండిల్‌ చేశాడనే కథాంశంతో సినిమా రూపొందనుంది.

మంచి కామెడీ, లవ్‌, ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌, యూత్‌ను ఆకట్టు-కునే అంశాల మేళవింపుంగా సినిమా ఆకట్టు-కోనుంది. అన్నారు. ఈ చిత్రంలో చైతన్య రావ్‌, హృతికా శ్రీనివాస్‌, కృష్ణ చైతన్య, సాయి శ్రీనివాస్‌, సుదర్శన్‌, మహేష్‌ అచంట, మహేష్‌ విట్టా, రాజేష్‌ ఉల్లి, షిన్నింగ్‌ ఫణి తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement