Friday, May 3, 2024

మద్యం మత్తు లో డ్రైవింగ్ – నవ జంటతో సహా ముగ్గురు దుర్మరణం

విశాఖ-భీమిలి మార్గంలో సోమవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మధ్యం మత్తు లో అతి వేగంగా కారును నడంపడం తో మూడు ప్రాణాలు పోయాయి.సాగర్‌నగర్‌ నుంచి ఎండాడ వైపు వెళ్తున్న కారు సరిగ్గా రాడీసన్‌ హోటల్‌ మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది.

డివైడర్‌ను ఢీకొట్టి…తర్వాత చెట్టును ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకుపోయింది. ఆ దారిలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న దంపతులు దంపతులు పృథ్వీరాజ్‌(28), ప్రియాంక(21) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ప్రమాదానికి గురైన కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా.. వీరిలో వెనుక సీట్లో కూర్చున్న ఎం. మణికుమార్‌(25) తీవ్రంగా గాయపడి కారులోనే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప గాయాల పాలైన ఇంకో ముగ్గురు ఘటనాస్థలి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు బీచ్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన ఇద్దరిని కేజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. అతివేగం.. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement