Friday, May 3, 2024

పాక్ లో లాండ్ మైన్ బ్లాస్ట్ – ఏడుగురు దుర్మరణం

ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో భారీపేలుడు సంభవించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బలూచిస్థాన్లోని పంజ్గూర్ జిల్లాలో ఓ వాహనం లక్ష్యంగా ల్యాండ్మైన్ పేల్చారు. దీంతో బల్గతార్ యూనియన్ కౌన్సిల్ చైర్మన్ ఇష్తియాక్ యాకూబ్తో, సహా ఏడుగురు మరణించారు.

గత రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన ఇష్తియాక్.. తన కారులో తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు చేరుకోగానే మందపాతరను పేల్చారు. దీంతో ఇష్తియాక్ సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు దవాఖానలో చికిత్సపొందుతూ చనిపోయారని పంజ్గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement