Friday, April 26, 2024

ఒకరి కోసం ఒకరు ఉందాం… న్యాచురల్ స్టార్ నాని

కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలు వణికిపోతున్నారు. ప్రతి రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మరోవైపు భారత్ లో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచింది. కాగా టాలీవుడ్ హీరో నాని కరోనా కష్టాలను ఉద్దేశిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. మేఘాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు….

అందరూ క్షేమంగా ఉండండి. ఒకరి కోసం ఒకరు ఉండండి అంటూ ఇంస్టాగ్రామ్ లో నాని పోస్ట్ చేశాడు. వర్షం కురిపించేందుకు ఆకాశంలో కమ్ముకు వచ్చిన మేఘాల ఫోటోను షేర్ చేశాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు చేస్తున్నాడు.

https://www.instagram.com/p/COfhxmGj3lF/?utm_source=ig_web_copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement