Friday, April 26, 2024

ముంబైలో నాని టీం.. కొత్త చిత్రం మేజ‌ర్ షెడ్యూల్

నేచుర‌ల్ స్టార్ నాని కొత్త చిత్రం ప‌నులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం నాని శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడితో ఓ ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నారు.ఈ సినిమాను క్రిస్మస్‌ వీక్‌ సందర్భంగా డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ మొదల‌యింది. కాగా తాజాగా చిత్రబృందం ఓ మేజర్‌ షెడ్యూల్‌ కోసం ముంబై వెళ్లిందట. వారం రోజులకు పైగా అక్కడే షూటింగ్‌ జరుగనుందట. ఈ షెడ్యూల్‌లో నానిపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఫాదర్‌-డాటర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాళ్‌ థాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement