Wednesday, May 1, 2024

బ్రతికుండగా చంపేశారు…ముఖేష్ ఖన్నా

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం కూడా ఇట్టే వైరల్ అయిపోతుంది. దీని వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అదే స్థాయిలో ఉంది. అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీల విషయానికి సంబంధించి మాత్రం చిన్న విషయం బయటకు వచ్చినా తెగ వైరల్ అవుతుంది. ఇక ఇటీవల గత కొద్ది రోజులుగా ముఖేష్ కన్నా కరోనా తో చనిపోయారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇక సోషల్ మీడియాలో వస్తున్నవార్తలు చూసి నిజమే అనుకుని అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.

ఇది అటు తిరిగి ఇటు తిరిగి ముఖేష్ కన్నా దృష్టికి వెళ్లింది. ఇదే విషయంపై స్పందిస్తూ… కరోనా కారణంగా తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలలో నిజం లేదు. తనకు కరోనాతో అసలు రాలేదని తాను ఎంతో ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. మీ ఆశీర్వాదాలు వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను ఆస్పత్రిలో చేరాను అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో. . ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు. ఇలాంటి వారిని ఏం చేస్తే మానేస్తారు.. కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ ల తో ప్రజల ఎమోషన్స్ తో ఆడుకోవడం చాలా తప్పు. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి ఇలాంటి అసత్య ప్రచారాలతో విసిగిపోయాను అంటూ చెప్పుకొచ్చారు ముఖేష్ ఖన్నా .

Advertisement

తాజా వార్తలు

Advertisement