Tuesday, May 7, 2024

Mrinal : బాహుబ‌లి స‌ర‌స‌న మృణాల్

స్టార్‌ హీరోల చిత్రాల్లో కొత్త హీరోయిన్లకు అవకాశాలు కల్పించడం ప్రస్తుతం ట్రెండ్‌. ఒకసారి నటించిన నటితో హీరో కాంబినేషన్‌ రిపీట్‌ అవకుండా ప్లాన్‌ చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు కొత్త కాంబినేషన్‌ చూసిన ఫీలింగ్‌ కలుగుతుందని దర్శకుల ఆలోచన. ఆ ఆలోచన కారణంగానే ‘సీతారామం’ ఫేమ్‌ మృణాళ్‌ ఠాకూర్‌కు ప్రభాస్‌ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిసింది.

- Advertisement -

‘సీతారామం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇటీవలే విడుదలైన ‘హాయ్‌ నాన్న’తో మరో విజయం అందుకుంది. టాలీవుడ్‌లో నాయికల మధ్య పోటీ ఉన్నప్పటికీ, మృణాళ్‌కు మాత్రం అవకాశాలు వస్తున్నారు. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కొత్త సినిమాలో ఆమెను ఎంపికచేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైన పక్షంలో మృణాళ్‌కు మంచి అవకాశం వచ్చినట్టుగానే భావించవచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. మృణాళ్‌ ప్రస్తుతం విజయదేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాలో నటిస్తోంది.

అపురూప గౌర‌వం
2018లో ఆమె నటించిన ‘లవ్‌ సోనియా’ చిత్రం మానవ అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమాలో మృణాల్‌ అద్భుతంగా నటించడమే కాదు, పాత్ర పరంగా కథానాయికలు చేయలేని సాహసాలను చేసిందనే చెప్పాలి. అందులోని కొన్ని సన్నివేశాలు సోషల్‌మీడియాలో ఇప్పటికీ ప్రత్యక్షమవుతుంటాయి. ఇదంతా దేనికంటే.. న్యూయార్క్‌లోని యూఎన్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘హ్యూమన్‌ కాప్ట్‌ ఆఫ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ రిలేటెడ్‌ సెక్సువల్‌ వయోలెన్స్‌’ కార్యక్రమానికి మృణాల్‌ హాజరవ్వనుంది. ఈ కార్య‌క్ర‌మానికి ఆమెకు ఆ సంస్థ స్వ‌యంగా ఆహ్వానం పంపింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement