Monday, April 29, 2024

జ్వ‌రం వ‌ల్ల మిమ్మ‌ల్ని మిస్ అవుతున్నా.. స‌మంత ట్వీట్

జ్వ‌రంతో ఇబ్బంది ప‌డుతోంద‌ట స్టార్ హీరోయిన్ స‌మంత‌. ఈ వారమంతా నా సినిమాని ప్రమోట్‌ చేస్తూ.. మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. అయితే, దురదృష్టవశాత్తూ బిజీ షెడ్యూల్స్‌, ప్రమోషన్స్‌ కారణంగా ప్రస్తుతం నేను జ్వరంతో బాధపడుతున్నాను. మాట్లాడలేకపోతున్నాను . దయచేసి ఈ సాయంత్రం MLRIT కళాశాల వార్షిక దినోత్సవ కార్యక్రమంలో శాకుంతలం బృందంతో చేరండి. మిమ్మల్ని మిస్‌ అవుతున్నా అంటూ ట్వీట్‌ చేసింది.
సామ్‌ టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్న తాజా చిత్రం శాకుంతలం . గుణశేఖర్‌ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 14న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం సామ్‌ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమాలో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్ నటిస్తున్నారు. అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement