Thursday, May 2, 2024

ఎనిమిదవ రోజు లాభాల‌తో ముగిసిన.. స్టాక్ మార్కెట్లు

వ‌రుస‌గా ఎనిమిద‌వ రోజు లాభాల‌తో ప్రారంభ‌మై..లాభాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు మన మార్కెట్లకు అండగా నిలిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 60,393కి పెరిగింది. నిఫ్టీ 90 పాయింట్లు పుంజుకుని 17,812కి చేరుకుంది. ఇన్ఫోసిస్ (1.52%), టాటా మోటార్స్ (1.42%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.27%), ఏసియన్ పెయింట్స్ (1.17%), టెక్ మహీంద్రా (1.08%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.58%), నెస్లే ఇండియా (-1.28%), ఎన్టీపీసీ (-1.24%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.87%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.70%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement