Thursday, May 9, 2024

క్యారవాన్ డ్రైవర్ కు మెగాస్టార్ ఆర్ధిక సహాయం

మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నాడు. అయితే ఆయన క్యారవాన్ డ్రైవర్ జైరామ్ ఇటీవల కరోనాతో మృతి చెందాడు. కాగా ఆయనకు భార్య శోభారాణి ఒక కుమార్తె వినోదిని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక జైరామ్ మరణం తర్వాత…మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఆదుకున్నారు. అతని కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును పంపించారు.

జైరామ్ భార్య శోభ వారి పిల్లలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి వచ్చి చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు చేతుల మీదుగా చెక్ ను అందుకున్నారు. ఇక జైరామ్ భార్య శోభారాణి మాట్లాడుతూ… చిరంజీవి గారు ఆపద్బాంధవుడు. ప్రతిసారి మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. ఇంతకుముందు బైక్ పై వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. వెంటనే ఉపాసన గారికి ఫోన్ చేసి వైద్య సహాయం అందించారు. మా కుటుంబానికి ఆర్థిక కష్టం లేకుండా ఆదుకున్నారు. ఇప్పుడు మరో సారి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది మా పిల్లలకు పెద్ద సాయం. చిరంజీవి గారికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement