Sunday, May 19, 2024

ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు మారిమ‌త్తు క‌న్నుమూత

తమిళ నటుడు, దర్శకుడు మారిముత్తు మరణించాడు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కటుంబ సభ్యులు దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స జరుగుతుండగానే మారిముత్తు తుది శ్వాస విడిచాడు. ఆయన మరణంతో తమిళ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. మారి ముత్తు మరణం పట్ల పలువురు సెలబ్రెటీలు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు.

ఇక మారిముత్తు రెండు దశాబ్దాలుగా తమిళ ఇండస్ట్రీలో బిజీయెస్ట్‌ నటుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన వందకు పైగా సినిమాల్లో నటించాడు. కేవలం నటుడుగానే కాకుండా రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. మారి ముత్తు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేరుగా తెలుగులో ఆయన నటించకపోయినా పలు తమిళ డబ్బింగ్‌ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించాడు. చినబాబు, పందెం కోడి-2, సుల్తాన్‌, డాక్టర్‌ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. ఎక్కువగా నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లోనే మారిముత్తు కనిపించాడు. ఇక ఇటీవలే రిలీజైన జైలర్‌లో విలన్‌కు నమ్మకస్తుడిగా కీలకపాత్ర పోషించాడు. శంకర్‌ తెరకెక్కిస్తున్న ఇండియన్‌-2లోనూ మారిముత్తు నటించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement