Thursday, May 2, 2024

అక్ష‌య్ కుమార్ ‘మిష‌న్ రాణిగంజ్’ టీజ‌ర్….

YouTube video
బాలీవుడ్‌లో ఓ మై గాడ్ చిత్రంతో చాలా రోజుల‌కు హిట్ కొట్టిన హీరో అక్షయ్ కుమార్ న‌టిస్తున్న తాజా చిత్రం మిషన్ రాణిగంజ్ . ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక . బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా కథానాయిక . టిను సురేష్ దేశాయ్ దర్శకుడు. ఈ మూవీ నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.


1989 నవంబర్ 13న రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో జరిగిన ప్రమాదంపై ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ ప్రమాదంలో జస్వంత్ సింగ్ గిల్ అనే మైనింగ్ ఇంజనీర్ బొగ్గు గనుల్లో చిక్కుకున్న 64 మందిని కార్మికులను కాపాడారు. అతని జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే మైనింగ్ ఇంజనీర్ పాత్రలో అక్షయ్ కుమార్ క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 06న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement