Thursday, April 25, 2024

మళ్ళీ లీకులు…ఇబ్బంది పడుతున్న సర్కారు వారి పాట టీం

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ ను ఇటీవలే స్టార్ట్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, అలాగే డైలాగ్స్ లీక్ కావడం ఇప్పుడు అటు దర్శకనిర్మాతలకు హీరో మహేష్ బాబు కి తలనొప్పిగా మారాయి.

అయితే ఇప్పటికే మహేష్ బాబు లీక్ లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే తాజాగా కొన్ని డైలాగ్స్ లీక్ కావడం ఆ డైలాగ్స్ ను సోషల్ మీడియాలో మహేష్ అభిమానులే విపరీతంగా షేర్ చేయడం మరింత తలనొప్పిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ లీకులు ఆగడంలేదు. దీంతో చిత్ర యూనిట్ ఏం చేయాలో తెలియని స్థితిలో పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement