Sunday, April 28, 2024

సర్కారు వారి పాట సెట్ లో మహేష్ అడుగుపెట్టేది అప్పడే ?

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక హైదరాబాదులో నెక్స్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టాలి అనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

అయితే తాజాగా కరోనా తగ్గుముఖం పడుతుండటంతో షూటింగ్ లు తిరిగి రీస్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు ఈ నెల 16వ తేదీన అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2022 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement