Saturday, May 4, 2024

విలన్ కోసం ప్రత్యేక సెట్ @సలార్

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూర్తిగా మారిపోయారు. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. వీటితో పాటు ఆదిపురుష్, అలాగే సలార్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. కే జి ఎఫ్ సినిమా తో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.

ఇక ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర యూనిట్ విలన్ కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ను నిర్మిస్తోందట. ఈ సెట్లో ప్రభాస్ తో పాటు విలన్ పై కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట.అలాగే ఈ సెట్ కోసం భారీ బడ్జెట్ ను కూడా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement