Thursday, May 16, 2024

పాత నోట్లు, నాణేల విషయంలో జాగ్రత్త: ఆర్‌బీఐ

పాత కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పాత నోట్లు, నాణేల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. పాత నోట్ల క్రయవిక్రయాలపై ఛార్జీలు, కమిషన్ వసూలు చేసే వారి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యక్తులు లేదా కంపెనీలు పాత నాణేలు, పాత నోట్లను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును ఉపయోగించుకోవచ్చని, అలాంటి ఆఫర్లను నమ్మవద్దని ఆర్‌బీఐ ప్రజలను అలర్ట్ చేసింది.

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా కొంత మంది పాత నోట్లను కొనుగోలు లేదా అమ్మకం నిర్వహిస్తున్నారని ఆర్‌బీఐ దృష్టికి వెళ్లింది. దీనికి ఆర్‌బీఐ పేరు, లోగోను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. తాము ఏ వ్యక్తికి లేదా సంస్థలకు ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఛార్జీలు లేదా కమిషన్ వంటివి వసూలు చేయడం లేదని తెలిపింది. అందువల్ల ప్రజలు ఇలాంటి కార్యకలాపాలతో జాగ్రత్తగా ఉండాలని కోరింది. అందువల్ల ప్రజలు పాత నోట్లు, నాణేల విషయంలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే.

ఈ వార్త కూడా చదవండి: ఆర్థిక వ్యవస్థ గాడిన పడే వరకు అవే వడ్డీ రేట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement