Friday, April 26, 2024

కీయరా ఫుల్ జోష్…రామ్ చరణ్ తో మరోసారి?

హీరోయిన్ కియారా అద్వానీ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఈ అమ్మడు. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. కాగా ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సరసన నటించబోతుంది కీయరా. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో కూడా కీరా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. అంతేకాకుండా బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో అపరిచితులు రీమేక్ చేయబోతున్నాడు శంకర్. ఈ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకోబోతున్నారట.

అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా కీయరానే నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement