Thursday, May 2, 2024

కత్తి మహేష్ వైద్య ఖర్చులకోసం…ఏపీ ప్రభుత్వం సహాయం

కత్తి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం పట్ల కొంతమంది విరాళాలను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం 17 లక్షల రూపాయల ను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. సీఎంఓ అందుకు సంబంధించిన లేఖను కూడా విడుదల చేసింది.

ఇక నెల్లూరులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ ప్రమాదంలో కత్తి మహేష్ ముఖానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇక ప్రస్తుతం కత్తి మహేష్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యానికి కూడా స్పందిస్తూ వేగంగా కోరుకుంటున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement