Saturday, April 27, 2024

కంగనా వార్నింగ్….తలైవి పై పుకార్లు మానుకోండి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం తలైవి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ కరోనా కారణంగా సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడడంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ కాబోతుంది అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇదే విషయమై కంగనా రనౌత్ స్పందించారు.

సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…తలైవి డిజిటల్ హక్కులు తమిళంలో అమెజాన్, హిందీలో నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఏ ఓటీటీ సంస్థ కూడా ప్రసారం చేయువు. దయచేసి పుకార్లు ఆపేయండి. ఇకపై ఫేక్ పుకార్లు క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది… అంటూ వార్నింగ్ ఇచ్చింది కంగనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement