Saturday, April 20, 2024

ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య

పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి పండగపూట విషాదం చోటు చేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన విజయ ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఎదిరోజు విజయ(30) శ్రీ కూర్తి (16 నెలలు)శివకృష్ణ(03) మృతి చెందారు. భర్త,అత్త,ఆడబిడ్డ తరచు వేదింపులకు గురిచేయడంతో విజయ ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పెద్దపెల్లి ఏసీపీ నీతిక పంత్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement