Saturday, April 27, 2024

తలైవి పై మరోసారి క్లారిటీ ఇచ్చిన కంగన

ఏ ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జయలలిత గా కంగనారనౌత్ కనిపించనుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా గతంలో ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతోంది అంటూ ప్రచారం జరగదా… అది అంతా అబద్ధం అంటూ క్లారిటీ ఇచ్చింది కంగన.

అయితే తాజాగా మరోసారి ఈ సినిమా రిలీజ్ ఓటీటీ లో అంటూ సోషల్ మీడియాలో వార్తలు రాగా….కంగనా క్లారిటీ ఇచ్చింది. తలైవి విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. మేము దేశవ్యాప్తంగా థియేటర్లను ఓపెన్ చేసినప్పుడే తలైవి ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. దయచేసి పుకార్లు నమ్మకండి. దూరంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement