Thursday, April 25, 2024

ఆస‌క్తిగా ‘దృశ్యం2’ టీజ‌ర్..పాత క‌థ‌తో ముడిప‌డివుందే..

దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా దృశ్యం2 తెర‌కెక్కింది. ఈ చిత్రంలో కూడా హీరో వెంక‌టేష్, మీనాలు ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషించారు. కాగా ఈ చిత్ర టీజ‌ర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ (సీబీఎఫ్‌సీ) యూ సర్టిఫికెట్‌ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రాంబాబు కేసు ఏటైనాది.. అంటూ ఆస‌క్తిరేపే ప్ర‌శ్న‌తో ‘దృశ్యం-2’ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. వెంకటేశ్ భార్య‌గా మీనా ఇందులో న‌టించారు. ఈ సినిమాలో రాంబాబు అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి పాత్ర‌లో వెంక‌టేశ్ నటించారు. హ‌త్య కేసు నుంచి, పోలీసుల విచారణ నుంచి త‌న కుటుంబాన్ని ఎలాగైనా స‌రే కాపాడుకోవాల‌ని త‌ప‌న ప‌డే వ్య‌క్తిగా వెంక‌టేశ్ క‌న‌ప‌డ‌తారు. ఆరేళ్లుగా డిపార్ట్ మెంట్ ను వేధిస్తోన్న ప్ర‌శ్న అంటూ ‘దృశ్యం’లోని హ‌త్య‌ కేసును ‘దృశ్యం-2’లోనూ ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఈ టీజ‌ర్‌లో చూపించారు.

‘ఒరేయ్ చంటి, ఆయ‌న కేసు ఏటి అయినాదిరా.. రాంబాబు కేసు ఏటైనాది స‌ర్’ అంటూ ఇద్ద‌రు మాట్లాడుకుంటున్న‌ట్లు డైలాగులు వినిపించారు. ‘రాంబాబు అంటే వ‌రుణ్ కేసులో..’ అంటూ పోలీసు అధికారి అంటాడు. అందుకు కానిస్టేబుల్ స్పందిస్తూ ‘అవును స‌ర్ అత‌డే’ అని చెబుతాడు. టీజ‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠనింపే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు ఈ కేసును పోలీసులు ఛేదిస్తారా ఈ సినిమాలోనూ కేసు నుంచి వెంక‌టేశ్ కుటుంబం త‌ప్పించుకుంటుందా? అన్న ఆస‌క్తిని ప్రేక్ష‌కుల్లో నింపారు. ఈ సినిమాకు జీతూ జోసఫ్‌ దర్శకత్వం వహించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement