Tuesday, April 23, 2024

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

దివ్యాంగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో సిఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విఫ‌ల‌మ‌య్యార‌ని జ‌నసేన పార్టీ దివ్యాంగుల జ‌న‌సైనికుడు గోగ‌న ఆదిశేషు అన్నారు. శుక్ర‌వారం మండ‌ల ప‌రిధిలోని జిల్లెలమూడి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 18 న నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దివ్యాంగులకు వెయ్యి కోట్ల బడ్జెట్ ను విడుదల చేయాలని, ముఖ్యంగా దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని అసెంబ్లీలో అమలు చేయాలన్నారు. దివ్యాంగుల కుటుంబాలకి 300 యూనిట్ల ఉచిత కరెంటు కల్పించాలని తమ డిమాండ్లను అసెంబ్లీలో ప్రకటించి దివ్యాంగులకు అండగా నిలవాలని కోరారు. అధికారంలోకి రాకముందు దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి,అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులను పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్,తాడిశెట్టి శ్రీనివాసరావు,రామారావు, గండికోట బ్రహ్మయ్య, తాండూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement