Sunday, April 28, 2024

సలార్ రెండు పార్టులు గా రాబోతోందా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలాఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతుందట. కే జి ఎఫ్ మాదిరిగానే రెండు భాగాలుగా చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రభాస్ ముందు పెట్టాడట ప్రశాంత్.

ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట. అయితే ప్రభాస్ నుంచి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. ప్రభాస్ ఒకవేళ ఓకే చెప్తే స్క్రిప్ట్ డెవలప్మెంట్, బడ్జెట్ మిగిలిన విషయాల గురించి చర్చించనున్నారట. ఇక గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి రెండు పార్టులుగా తెరకెక్కింది. అలాగే ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ కూడా రెండో పార్ట్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ రానుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement