Tuesday, May 21, 2024

భారీ ప్రాజెక్టుల‌తో మెగా బ్ర‌ద‌ర్స్..వీరి రూటే వేర‌ప్ప‌..

రాజ‌కీయాలు ఓ ప‌క్క‌..సినిమాలు మ‌రోప‌క్క ఇలా బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు జ‌న‌సేన అధినేత‌..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. ఆయ‌న చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రాజ‌కీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మంచి దూకుడు మీదున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుతో పాటు భీమ్లానాయ‌క్ చిత్రాల షూటింగ్ ల‌లో పాల్గొంటున్నాడు ప‌వ‌న్. ఇప్పుడు భీమ్లానాయక్ పాటల వరకు వచ్చేసింది. ఈ రెండూ చిత్రాలు ఇలా వుండగానే టైటిల్ అనౌన్స్ జరిగిపోయిన ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ సినిమా పెండింగ్ లో వుంది.

త‌మ్ముడు ఇలా ఉంటే ఇక అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే రూటులో వెళ్తున్నారు. లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా గాడ్ ఫాదర్ చిత్రాన్ని ప్రారంభించారు. అది మెల మెల్లగా నడుస్తోంది. ఈ లోగా బాబీ డైరక్షన్ సినిమాకు పూజని కూడా కానించేశారు. . అక్కడితో ఆగకుండా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో భోళాశంకర్ పూజకు ముహుర్తం పెట్టేసారు. అంతే కాదు నవంబర్ 15 నుంచి షూటింగ్ కూడా ప్రారంభం కానుంద‌నే టాక్ వినిపిస్తోంది. అంటే గాడ్ ఫాదర్ కొన్నాళ్లు పక్కన వుంటుందన్నమాట.

మొత్తానికి చూస్తుంటే సినిమా సినిమాకి 50 నుంచి 60 కోట్లరూపాయ‌ల‌ను పెంచేసి.. చకచకా ఓ అరడజను సినిమాలు చేసేసి రిటైర్ కావాలని చూస్తున్న‌ట్లు ఉన్నారు ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు. యంగ్ హీరోల‌కి సైతం పోటీగా నిలుస్తూ మంచి క‌థ‌ల‌ను సెలెక్ట్ చేసుకుంటూ త‌మ‌దైనశైలిలో దూసుకుపోతున్నారు మెగా బ్ర‌ద‌ర్స్. ఏమైనా వీరి రూటే వేర‌ప్ప అనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement