Monday, May 20, 2024

TSRTC: పానుగల్ మీదుగా హైదరాబాద్ కు ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభం

పానుగల్ (ప్రభా న్యూస్): కొల్లాపూర్ నుండి పాన్ గల్, వనపర్తి, బిజినేపల్లి మీదుగా హైదరాబాద్ కు ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సును జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మునీరొద్దీన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లాపూర్ నుంచి నేరుగా హైదరాబాద్ కు బస్సు సౌకర్యం లేక ఈ రూట్ లో ఉన్న పలు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వారని అన్నారు.

ఈ బస్సు నడపడానికి కృషిచేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ శాసన సభ్యులు భీరం హర్షవర్దన్ రెడ్డికి, అందుకు సహకరించిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఉషాదేవి, కొల్లాపూర్ డిపో మేనేజర్ వెంకట ప్రసాద్ గౌడ్ కు కృతఙ్ఞతలు తెలిపారు. పాన్ గల్ మండల ప్రజలతో పాటు సింగోటం, నర్సాయపల్లి, కొర్లకుంట, బొల్లారం, వల్లభాపూర్, కల్వరాల తదితర గ్రామాల ప్రయాణీకులు ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించు కోవాలని, మరికొద్ది రోజుల్లోనే రెండో బస్సును కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement