Saturday, May 4, 2024

Thamanకు గుంటూరు కారం ఘాటు.. మ్యూజిక్‌పై మహేష్ ఫ్యాన్స్ గరం గరం..

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ “గుంటూరు కారం”. త్రివిక్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించిన మేకర్స్.. ‘‘ఓ మ బేబీ’’ అనే సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.

అయితే, ఈ సాంగ్ కారణంగా థమన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ ట్రాక్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో మహేష్ బాబు అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేసారు. ఈ విషయంపై సూపర్ స్టార్ అభిమానులు సంగీత దర్శకుడిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రమ్య కృష్ణన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ మరియు ఇతరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement