Friday, May 3, 2024

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గతంలో ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్ పైన కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా అదరగొట్టాడు. బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ గా గా వ్యవహరించి తన లో ఉన్న టాలెంట్ ని బయట పెట్టాడు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇక ఇన్నాళ్లకు గ్రాండ్ రియాల్టీ షో అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్.

అయితే అందుకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చి చాలా సమయం అవుతున్నప్పటికీ.. ముందడుగు పడలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా కూడా ఈ షో ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తాజాగా ఈ షో కు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. వచ్చేవారం నుంచి తారక్ షూట్ వేసుకొని షూటింగ్ లో పాల్గొన బోతున్నాడట. మరి చూడాలి ఈ షో ద్వారా ఏమేర అభిమానులను ఆకట్టుకుంటాడో.

Advertisement

తాజా వార్తలు

Advertisement