Friday, April 26, 2024

Disha Patani | శ్వేతాంబ‌రి….

మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి లోఫర్‌ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ. ఈ అమ్మడు తెలుగు లో మొదటి సినిమాతో నిరాశ పరచడంతో ఆ తర్వాత ఆఫర్లు దక్కలేదు. ఆ సమయంలో బాలీవుడ్‌ లో ఈ అమ్మడు ప్రయత్నాలు చేసి సక్సెస్‌ అయ్యింది. బాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది.

అంతే కాకుండా తెలుగులో కూడా ఈ అమ్మడు ప్రభాస్ కి జోడీగా కల్కి సినిమాలో నటించింది. సౌత్ లో చాలా కాలం తర్వాత నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సౌత్‌ సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో మాత్రం అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూనే ఉంటుంది.

తాజాగా మరోసారి తెల్లటి డ్రెస్ లో అందాల పాల రాతి శిల్పం మాదిరిగా ఈ అమ్మడు కెమెరా కు ఫోజ్ ఇచ్చి చూపు తిప్పుకోనివ్వడం లేదు. అందాల ముద్దుగుమ్మ దిశా పటానీ సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతటి అందం ను తెలుగు లో వరుస సినిమాల్లో ఎప్పుడు చూస్తామా అంటూ తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉన్నారు. బాలీవుడ్‌ లో ఈ అమ్మడు ఇంతటి అందంతో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement