Tuesday, May 7, 2024

కరోనా తో మరో తెలుగు దర్శకుడు మృతి

దేశంలో లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు వేలల్లో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకి సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా కారణంగా తెలుగు దర్శకుడు మృతి చెందారు. దర్శకుడు రచయిత అయిన ఎన్ సాయి బాలాజీ ప్రసాద్ కరోనా తో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

రియల్ స్టార్ శ్రీహరి నటించిన శివాజీ, ఒరేయ్ తమ్ముడు చిత్రాలకు సాయి బాలాజీ దర్శకత్వం వహించారు. అలాగే బుల్లితెరపై పలు సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సాయి బాలాజీ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement