Sunday, April 28, 2024

శ్రీదేవి సోడా సెంటర్ పై డైరెక్టర్ ఎమోషనల్ లెటర్

లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లో సందడి చేయగా…. రేపు శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కరణ్ కుమార్ సోషల్ మీడియాలో ఎమోషనల్ లెటర్ ని పోస్ట్ చేశారు. తాను ఒక దర్శకునిగా సినిమా ప్రేక్షకుడి గా ఎలా ఫీలవుతున్నారో చెప్తూ… తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. మెగాస్టార్ సినిమా ఖైదీ నెంబర్ 786 ఎలా అయితే నేల టికెట్ తో శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో చూశానో ఇప్పుడు ఈ సినిమాని కూడా అలాగే చూస్తానని అన్నారు.

నేల టికెట్ లో కూర్చుని…ఈ సినిమా చూస్తే వచ్చే ఆ కిక్కే వేరు అని చెప్పుకొచ్చారు కరుణ కుమార్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement