Monday, April 29, 2024

Cyclone Michaung | చెన్నై వరద బాధితులకు సూర్య, కార్తీ ఆర్ధిక సాయం..

తమిళనాట మైచాంగ్ తుఫాను ప్ర‌భావంతో భారీ వర్షాలు ప‌డుతున్నాయి. దీంతో అక్కడ అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి పెరిగిపోవడం మూలాన వరదల్లో మునిగిపోయాయి. దీనితో అక్క‌డివారి కోసం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోస్ సూర్య అలాగే తన తమ్ముడు కార్తీలు ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది.

ఆ బాధితుల కోసం సూర్య, కార్తీలు 10లక్షలు రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందించినట్టుగా తెలుస్తుంది. దీంతో వారి ఉదారత మరోసారి చాటుకున్నారని చెప్పాలి. ఇక సూర్య ఇప్పుడు తన భారీ చిత్రం “కంగువ” లో బిజీగా ఉండగా కార్తీ రీసెంట్ గానే “జపాన్” అనే చిత్రంతో తెలుగు తమిళ ఆడియెన్స్ ని పలకరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement