Monday, April 29, 2024

కరోనా దెబ్బ – షూటింగ్ కి నో చెప్పిన జగపతిబాబు

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రతిరోజు లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి. అలాగే షూటింగ్ రద్దు చేసుకుంటున్నాయి. నిబంధనలు ఎన్ని పాటిస్తున్నప్పటికీ ఆ మహమ్మారి బారినుండి తప్పించుకోలేక పోతున్నారు.

తాజాగా సీనియర్ నటుడు జగపతి బాబు కూడా షూటింగ్ కు రాలేనని చేతులెత్తేశాడట. ప్రస్తుతం జగపతిబాబు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాలో నటిస్తున్నాడు. శర్వానంద్ సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. అయితే జగపతిబాబు వైజాగ్ షెడ్యూల్ లో జాయిన్ అవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాను షూటింగ్ కు రాలేనని జగపతిబాబు తేల్చి చెప్పేశారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement