Saturday, April 27, 2024

రోలెక్స్ వాచ్ ధరించావు.. మస్క్ మరిచావా..?

బాలీవుడ్ నటీ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య నెట్టింట ట్రోల్ కు గురైంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క తన సెల్ఫీని పిక్ ని షేర్ చేసింది. అందులో రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కే వాచ్ ధరించింది.. ఆ వాచ్ ధర 65,879 డాలర్లు..అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 50లక్షలు. అయితే ఆమె పెట్టుకున్న ఖరీదైన వాచ్‌ గురించి అభిమానులు మాట్లాడుకుంటునే ట్రోల్‌ చేశారు. ”ఖరీదైన వాచ్‌ ధరించావు బాగానే ఉంది..కాని మాస్క్‌ మాత్రం మరిచిపోయావు” అంటూ ట్రోల్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో – విరుష్క దంపతులు ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కూతురు వామికాతో కలిసి పలు పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అనుష్క సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. కాగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి: బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టం అవ‌స‌ర‌మా?

Advertisement

తాజా వార్తలు

Advertisement