Saturday, April 27, 2024

‘మేజర్’ నుంచి మరో ఆసక్తికర వార్త

డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు యంగ్ హీరో అడవి శేషు. అమీ తుమీ, గూడాచారి, ఎవరు వంటి సినిమాలతో ఇప్పటికే మంచి హిట్ లను కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ముంబై ఉగ్రదాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సోని పిక్చర్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జూలై 2 న విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోళ్ల మాట్లాడుతూ మేజర్ చిత్రం కోసం మొత్తం ఆరు సెట్ వేయగా అందులో హోటల్ తాజ్ సెట్ ని మాత్రం రియలిస్టిక్ గా చూపించేందుకు 500 మంది పది రోజుల పాటు పని చేశారని ఆయన తెలిపారు. భారీ అంచనాల మధ్య జరుగుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement