Friday, April 26, 2024

అన్నవరంలో 10ఏళ్ల లోపు, 60ఏళ్ల పై బ‌డిన వారికి నో ఎంట్రీ

అన్న‌వ‌రం: ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవర క్షేత్రంలో నుంచి కొవిడ్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ ఆలయ ఈఓ త్రినాథరావు తెలిపారు. 10 ఏండ్ల లోపు పిల్లలను, 60 ఏళ్లు దాటిన వారిని ఆలయ పరిసరాల్లోకి అనుమతించబోమని వెల్లడించారు. అలాగే ప్రసాద పంపిణీ, విక్రయ కౌంటర్లను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. భక్తులు, ఆలయ సిబ్బంది ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆంక్షలను గుర్తించి భక్తులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement