Monday, April 29, 2024

ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న అల్లు అర్జున్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతోంది. మొదటి పార్ట్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఐకాన్ సినిమా చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు ఎప్పుడో రెడీ అయ్యాడు. పుష్ప పార్ట్ వన్ తర్వాత ఐకాన్ సినిమా కి డేట్స్ కూడా అల్లుఅర్జున్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు భామలతో అల్లు అర్జున్ నటించనున్నడట. ఒకరు పూజా హెడ్గే కాగా మరొకరు రష్మిక మందన్న అని తెలుస్తుంది. పూజా హెగ్డే గతంలో అల్లు అర్జున్ తో డీజే, అలా వైకుంఠపురములో సినిమాలు చేసింది. రష్మిక మందన ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement