Sunday, April 28, 2024

తన సిబ్బందికి వ్యాక్సిన్ ఇప్పించిన అల్లు అర్జున్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు. తన టీమ్ లోని 45 ఏళ్లకు పైబడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ డోసులు వేయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అల్లు అర్జున్ స్వయంగా పర్యవేక్షించారు. టాలీవుడ్ అగ్రహీరోల్లో సొంతంగా ఓ టీమ్ ను కలిగివున్న వారిలో అల్లు అర్జున్ ఒకడు. వారి బాగోగుల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. తన టీమ్ లోని అనేకమందికి పుట్టినరోజు వేడుకలను బన్నీ స్వయంగా నిర్వహిస్తుండడం తెలిసిందే. అల్లు అర్జున్ ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement