Friday, March 29, 2024

కర్నూలు జిల్లాలో భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

కర్నూలు జిల్లా పంచలింగాల సరిహద్దు వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా తెలంగాణ మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. జిల్లా ఎస్పీ ఫకీరప్ప, ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఆదేశాల మేరకు పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తెలంగాణ నుంచి ఏపీ వస్తున్న ఓ స్విఫ్ట్ డిజైర్ కారులో తనిఖీ చేయగా 480 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కారులోని వ్యక్తి తెలంగాణలోని నాగర్ కర్నూలు చెందిన అరుణ్ ఆచారిగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని, కారును, మద్యాన్ని కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ దాడుల్లో SEB ఇన్‌స్పెక్టర్ రవిచంద్ర, ఎస్సై శివప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ఖాజా, షరీఫ్, కానిస్టేబుల్ రంగస్వామి, SPO సుందర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement