Friday, March 29, 2024

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. భారత్‌లోనే టీ20 ప్రపంచకప్

కరోనా నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ అవసరం అయితే UAEలో నిర్వహిస్తామని గతంలో చెప్పిన బోర్డు ప్రస్తుతం తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఇండియాలోనే టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ఈ నెల 29న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 9 వేదికలను ప్రకటించింది.

టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనుంది. అటు ఈ ఏడాది అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలోనే ఉంది. ఈ టూర్‌లో భారత్ ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో 5 టెస్టులను ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement