Monday, April 29, 2024

నువ్వే కావాలి హీరోయిన్ .. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

అప్ప‌ట్లో వ‌చ్చిన నువ్వే కావాలి చిత్రం ఎంత పెద్ద హిట్టో అంద‌రికీ తెలిసిందే.ఈ చిత్రంలో హీరోగా త‌రుణ్ న‌టించ‌గా..హీరోయిన్ గా రిచా న‌టించింది. విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తరుణ్,రిచా పల్లాడ్ హీరో హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా వచ్చి 22 ఏళ్లు దాటింది. అయినప్పటికీ ఈ ఫిల్మ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా సినిమాలోని పాటలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఈ సినిమాలో పక్కింటమ్మాయి ఫీచర్స్‌తో అందరి మనసుల్లో ప్లేస్ సంపాదించుకుంది రిచా. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ.. పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వలేదు.

దీంతో.. 2011లో హిమాన్షు బ‌జాజ్ అనే బిజినెస్‌మ్యాన్‌ను మ్యారేజ్ చేసుకుని.. ఇండస్ట్రీకి దూరమైంది. ఈ జంటకు ఒక తనయుడు ఉన్నాడు. 2016లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన రిచా.. ఆదిపినిశెట్టి నటించిన మలుపు అనే మూవీ ద్వారా ప్రత్యేక పాత్రలో వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు తెలుగులో ఎక్కడా కనిపించలేదు. 2020లో యువర్ హానర్ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటూ ప్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న రిచా.. సోషల్‌ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన అప్ డేట్స్, ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. 43 ఏళ్ల వయస్సులో ఆమె అందం, ఫిట్ నెస్ చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement