Tuesday, April 30, 2024

చిరూ పుట్టినరోజు కానుకగా ఆచార్య విడుదల..?

చిరంజీవి – కొరటాల కాంబినేషన్లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను మొదట మే 14న విడుదల చేయాలని నిర్మాతలు డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడేమో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. సినీ పరిశ్రమ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇక మన తెలుగు లో చాలా చిత్రాలు ఏప్రిల్ మే నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేకపోతున్నారు నిర్మాతలు. అందుకే ముందుగా అనుకున్న సమయానికి కాకుండా ఆచార్య చిత్రాన్ని మరో డేట్ కి లాక్ చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు నిలిచిపోయింది. సాధ్యమైనంత త్వరలో తిరిగి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

అయితే చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ లోగా బ్యాలెన్స్ ఉన్న సీన్స్ ను .. రీ షూట్ చేయాలనుకున్న ఒకటి రెండు సీన్స్ ను పూర్తి చేసేస్తారట. ఆలస్యం అయినప్పటికీ చిరంజీవి బర్త్ డేకి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్త అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజా హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement