Monday, May 6, 2024

7/జి బృందావన్ కాలనీకి సీక్వెల్.. హీరోగా ర‌వికృష్ణ‌

సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కించిన చిత్రం 7/జి బృందావన్ కాలనీ.. కాగా ఈ చిత్రం రిలీజ్ అయి 20ఏళ్లు అయింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని తెర‌కెక్కించ‌నున్నారు.ఈ చిత్రంలో న‌టులు రవికృష్ణ.. సోనియా అగర్వాల్ జంటగా న‌టించారు. కాగా సీక్వెల్ విషయాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. తాజాగా సీక్వెల్ కు సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతోంది. ఈ సీక్వెల్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ రొమాంటిక్ డ్రామా సీక్వెల్ షూటింగ్ ను జూలై నెలలో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి పార్ట్ లో నటించిన రవికృష్ణ సీక్వెల్ లో కూడా నటించబోతున్నట్లుగా ఏఎం రత్నం పేర్కొన్నారు.సీక్వెల్ ను కూడా ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా సెల్వ రాఘవన్ రూపొందించబోతున్నాడు. గతంలో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ప్రస్తుతం హీరోయిన్ గా నటించే అవకాశాలు లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement