Friday, April 26, 2024

ఓటీటీ లో దృశ్యం 2 ?

విక్టరీ వెంకటేష్ హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం 2. ఈ సినిమాలో వెంకటేష్ సరసన సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తోంది. దృశ్యం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను వెంకటేష్ పూర్తి చేశాడు.

అయితే ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే ఓటీటీ లో విడుదల చేస్తే ఎలా ఉంటుందని దర్శక నిర్మాతలు చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దృశ్యం2 మలయాళ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement