Saturday, April 20, 2024

దేశంలో లక్షల్లో – రాష్ట్రంలో వేలల్లో…. 24 గంటల్లో 1500 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గటం లేదు. గడిచిన 24 గంటలలో కొత్తగా 2,61,500 కేసులు వెలుగుచూశాయి. మరోవైపు 24 గంటల్లో 1,501 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. తాజాగా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డిన వారి సంఖ్య కోటీ 48 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇందులో కోటీ 28 ల‌క్ష‌లకు పైగా ఇప్ప‌టికే కోలుకున్నారు. ఇక క‌రోనాతో ఇప్ప‌టిదాకా మరణించిన వారి సంఖ్య 1,77,150కు చేరింది. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు తెలంగాణ లోను ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,29,637 మందికి కరోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు చేయగా కొత్తగా 5,093 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా లెక్క ప్రకారం రాష్ట్రంలో క‌రోనా బారిన‌ప‌డిన వారి సంఖ్య 3 ల‌క్ష‌ల 51 వేల 424కి చేరింది. ఇక‌ ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,824కి చేరింది. మరోవైపు కరోనా బారి నుంచి గడిచిన 24 గంటల్లో1,555 మంది కోలుకున్నారు. వీరితో కలిపి రిక‌వ‌రీలు 3,12,563కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 37,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement