Monday, April 29, 2024

మార్చి 5న ‘పవర్ ప్లే’

యంగ్ హీరో రాజ్ తరుణ్ రూటు మార్చాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్ తరహా పాత్రల్లో కనిపించాడు. ఇప్పుడు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటించాడు..రాజ్ తరుణ్,హేమల్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం పవర్ ప్లే.  మార్చి 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. హీరోకు ఎదురైన పరిస్థితులు, వాటి నుంచి అతను ఎలా బయటపడ్డాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సస్సెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నటి పూర్ణ ఓ కీలక పాత్ర చేసింది. వనమాలి ప్రొడక్షన్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. 

https://youtu.be/r60pmATSUn4
Advertisement

తాజా వార్తలు

Advertisement