Friday, May 17, 2024

బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర

సినిమా వాళ్లకు శుక్రవారం ఓ సెంటిమెంట్‌. ఆ రోజు తమ సినిమా విడుదలయితే మంచి విజయం సాధించి కాసులు కురిపిస్తాయని ఓ నమ్మకం. అయితే ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ దగ్గర ఏకంగా 11 సినిమాలు సందడి చేయనున్నాయి. కరోనా లాక్‌‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత…ఇన్ని సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం ఇదే తొలిసారి. దీంతో ఇన్ని రోజులు మూగబోయిన థియేటర్లు ఇప్పుడు కళకళలాడనున్నాయి. వీటిలో ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో పక్కనపెడితే.. రిలీజ్‌కు మాత్రం చాలా సినిమాలు సిద్దమయ్యాయి.

ఈ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది యువకథానాయకుడు సందీప్‌ కిషన్‌ నటించిన ఏ1 ఎక్స్‌ప్రెస్‌ కూడా ఉంది. ఈ మూవీ సందీప్‌ కిషన్‌‌కు 25 వ చిత్రం. రాజ్‌ తరుణ్‌ నటించిన పవర్‌ ప్లే, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటించిన క్లైమాక్స్‌‌తో పాటుగా ప్లే బ్యాక్‌, షాదీ ముబారక్‌, ఏ, తారకత్న నటించిన దేవినేని, తోటబావి, శ్రీ పరమానందయ్య శిష్యుల కథ విడుదల కానున్నాయి. వీటితో పాటుగా డబ్బింగ్‌ సినిమాలు మన బాక్సాఫీస్‌ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. విజయ్‌ సేతుపతి నటించిన విక్రమార్కుడు, రాక్‌ స్టార్‌ యష్‌ మూవీ గజకేసరి కూడా రేపే విడుదల కానున్నాయి. వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement