Monday, May 6, 2024

కూచిపూడి నాట్యంతో అదరగొట్టిన కృతి శెట్టి

ఉప్పెన చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది కృతి శెట్టి. మొదటి సినిమా అయినప్పటికీ తన నటనతో అద్భుతంగా అందరినీ ఆకట్టుకుని విమర్శకులను సైతం మెప్పింది. కాగా మహాశివరాత్రి సందర్భంగా కూచిపూడి నాట్యంతో స్పెషల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఈశ్వర అంటూ సాగిన ఈ పాటకు కృతి అద్భుతంగా డాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి…

ఇక మరోవైపు సినిమాల విషయానికొస్తే కృతి శెట్టి ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్నశ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నటిస్తోంది. అలాగే సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా కృతినే నటిస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement